కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత
మంత్రిత్వ శాఖ దక్షిణ భారత
బోర్డు సభ్యుడు తుర్క నర్సింహ
భువనగిరి అర్బన్, జూలై 15: సంచార, విముక్త జాతులకు నాణ్యమైన విద్యనందించడం, ఆర్థికంగా, సామాజికంగా అభి వృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ, సా ధికారత మంత్రిత్వశాఖ దక్షిణ భారత బోర్డు సభ్యుడు తుర్క నర్సింహ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలలోని సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డు ద్వారా ప్రభు త్వం నిధులు కేటాయించి వారి సమగ్రాభివృద్ధికి చర్యలు చేప ట్టిందన్నారు. సంచార, విముక్త జాతుల పిల్లలకు అందుతున్న విద్య, వారి స్థితిగతుల పరిశీలనతో పాటు కొవిడ్, ఉదృతి నేప థ్యంలో పిల్లలపై చదువుల ప్రభావం, తెలుకునేందుకు ఆయన గురువారం జిల్లాలో పర్యటించి విద్య, వైద్య ఆరోగ్య శాఖ, ఎ స్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, మోడల్ స్కూల్స్, పీజీటీ, ప్రిన్సిపాల్, ఆశ్రమ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలకు సంబంధించిన సబ్జెక్టుల వారీ ఉపాధ్యాయులతో కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార, విముక్త జాతుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనపై జిల్లాలు పర్యటించి అధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు విషయంలో ఈ కమ్యూనిటీలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. గురుకుల పాఠశాలల్లో సం చార విముక్త జాతుల పిల్లలకు ఎట్రన్స్ పరీక్ష లేకుండానే ప్రవే శాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం 2020లో జారీ చేసిన జీ. వోనం.3 ఉత్తర్వులను అధికారులు అమలుకై అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ సం చార, విముక్త జాతుల సమగ్రాభివృద్దికి ప్రత్యేక బోర్డును కేం ద్రం ఏ ర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తద్వారా క్షేత్ర స్థాయిలో ఆయా జాతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సమావేశంలో డీసీపీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీని వాసరెడ్డి, డీఎంహెచ్వో సాంబశివరావు, డీఈవో చైతన్యజైనీ, సంక్షేమ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.