చౌటుప్పల్ రూరల్,ఆగస్టు4: నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నేలపట్ల గ్రామానికి చెందిన గంగాపురం అంజయ్యగౌడ్కు మంజూరైన సీఎం రిలీఫ్పండ్ చెక్కును (రూ.24 వేలు) హైదరాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యం పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కప్పుల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ బుట్టి శ్రీనివాస్, నాయకులు పబ్బతి ఆంజనేయులుగౌడ్, గంగాపురం నగేశ్గౌడ్, గంగాపురం సైదులు గౌడ్, పబ్బు శివకుమార్గౌడ్, ఎలమోని బాలకృష్ణాముదిరాజ్ పాల్గొన్నారు.
పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
పేదల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన స్వగృహంలో మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన చుక్క ఎల్లయ్యకు రూ.60వేలు, అల్లందేవి చెరువు గ్రామానికి చెందిన పుష్పమ్మకు రూ.26వేలు, కోతులపురం గ్రామానికి చెందిన మారయ్యకు రూ.50 వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతీసుకుంటుందన్నారు. దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామల భాస్కర్, రైతు బంధు సమితి కన్వీనర్ దేప విప్లవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బొమ్మకంటి స్వామి, గజం వెంకటేశ్వర్లు,దేప క్రాంతి కుమార్ రెడ్డి,పెంటయ్య పాల్గొన్నారు.