సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నది
రాష్ట్రంలో జోడెద్దుల్లా పరుగులు తీస్తున్న అభివృద్ధి, సంక్షేమం
మిషన్ భగీరథతో విరుగడైన ఫ్లోరోసిస్ పీడ
ఒక్క తెలంగాణలోనే అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
తండాలను గ్రామపంచాయతీగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే
రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
మునుగోడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన
ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు
సంస్థాన్ నారాయణపురం, ఫిబ్రవరి 24 : ‘అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు పొరుగు రాష్ర్టాలు చూస్తున్నాయి. యావత్ భారతదేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి గురువారం సుడిగాలి పర్యటన చేపట్టారు. మునుగోడు మండలంలోని కిష్టాపురం, చండూరు పట్టణంలో కాలినడకన ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. సర్కారు సాయం అందించేందుకు స్వయంగా వచ్చిన మంత్రికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం చండూరు మున్సిపాలిటీలోని బంగారుగడ్డలో అంబేద్కర్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యారు. సంస్థాన్నారాయణపురం మండల కేంద్రంలో జరిగిన సంత్సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి జగదీశ్రెడ్డి ప్రసంగించారు. దశాబ్దాల తరబడి మునుగోడు నియోజకవర్గాన్ని పీడించిన ఫ్లోరోసిస్ మహమ్మారిని మిషన్ భగీరథతో పారదోలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు. 2014కు ముందు కరువు కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితులే అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ను మొట్టమొదట గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నది ఒక్క మన రాష్ట్రంలోనేనని, తండాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించింది సీఎం కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
మం డల కేంద్రంలో ఎకరం విస్తీర్ణంలో అధునాతన బంజారా భవనం నిర్మించుకుందామని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జైహింద్ గార్డెన్లో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ 283జయంతి వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కలిసి మంత్రి గిరిజన పద్ధతిలో సేవాలాల్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ అనంతపురంలో పుట్టినా ఆయన సేవలను గుర్తించి జయంతి వేడుకలను రాష్ట్రంలో అధికారికంగా నిర్వహిస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. బంజారా భవనం నిర్మాణానికి వారం రోజుల్లో స్థలం కేటాయించాలని కలెక్టర్ను అదేశించారు.
సీఎం కేసీఆర్తో మాట్లాడి రూ.1కోటి బంజారా భవనం నిర్మించి వచ్చే సంవత్సరం నూతన భవనంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అంగరంగా వైభవంగా నిర్వహించుకుందామని అన్నారు. సంత్ సేవాలాల్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహానీయుడు అని తెలిపారు. వైస్ ఎంపీపీ రాజు మండల కేంద్రంలో సేవాలాల్ గుడి నిర్మించాలని కోరగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి స్పందించి రూ.12లక్షలతో ఆలయాన్ని నిర్మిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీలు గుత్తా ఉమాదేవి, తాడురి వెంకట్ రెడ్డి, జడ్పీటీసీలు వీరమళ్ల భానుమతిగౌడ్, నారా బోయిన స్వరూపారాణి, పీఏసీఏస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జగ్రాంనాయక్, చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలూనాయక్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదిప మంత్రి జగదీశ్రెడ్డి
అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని పొరుగు రాష్ర్టాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని కిష్టాపురం గ్రామంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలుకగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక తెలంగాణను కొట్లాడి సాధించిన కేసీఆర్.. ఎనిమిదేండ్లలోనే దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని కొనియాడారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణ నెత్తిన ఉన్న నీటి కుండ అని, వరుసగా పదేండ్లు కరువొచ్చినా సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా కేసీఆర్ అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థను రూపొందించారని చెప్పారు.
పెండ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక నిరుపేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి గొప్ప పథకాలకు రూపకల్పన చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కిష్టాపురం గ్రామానికి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నీటిని ఇవ్వకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కిష్టాపురం-కోతులారం వాగుపై వంతెన, గ్రామంలో రూ.20లక్షలతో మురుగుకాల్వ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన 53 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు మంత్రి జగదీశ్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘనస్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, మార్కెట్ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య, తాసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర నాయకుడు రవి, శ్రీనివాస్రెడ్డి, గాలయ్య, వెంకన్న, సుధాకర్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
చండూరులో..
చండూరు : చండూరు పట్టణంలో 25మందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఎంపీ బడుగుల లింగయ్యతో కలిసి ఆడబిడ్డ సారె కింద చీరెలు, వస్ర్తాలను అందించారు. మొదట మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కోటమైసమ్మ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. 4వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు మంత్రి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ జగదీశ్రెడ్డి, జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, నారబోయిన రవి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుర్రం మాధవీ వెంకట్రెడ్డి, తాసీల్దార్ మహేందర్రెడ్డి, కమిషనర్ వెంకట్రాం, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, బొబ్బల శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ముడిగె ఎర్రయ్య యాదవ్, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, మొగుదాల వెంకన్న, సతీశ్ గౌడ్, భిక్షం, గోపాల్గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.