ఆలేరు, ఫిబ్రవరి 24 : ఆలేరు పట్టణ సమగ్రాభివృద్ధికి అందరూ సహకరించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో 2022-23 సంవత్సరానికి రూ.13 కోట్ల అంచనా బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మారుతీరావు, మేనేజర్ శ్రీధర్రెడ్డి, కౌన్సిలర్లు భేతిరాములు, రాయపురం నర్సింహులు, జూకంటి శ్రీకాంత్, చింతలపాని సునీత, గుత్తా శమంత, దాసి నాగలక్ష్మి, సునీత పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆలేరురూరల్ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలాసత్పతి విద్యార్థులకు సూచించారు. మండలంలోని కొలనుపాక జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 40రోజుల యాక్షన్ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తూ 10 కి10పాయింట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. అలాగే మన ఊరు మన బడిలో పాఠశాలలో కల్పించాలిసిన వసతులు, తరగతి గదులు, ప్రహరీ తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో ఏఈ రమేశ్, ప్రధానోపాధ్యాయుడు ఎం.రాంచంద్రయ్య, ఉపాధ్యాయులు సత్యవతి, లక్ష్మణ్, లింగయ్య, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.