ఆలేరు టౌన్, జూలై 19 : మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. పొదుపు సంఘాలు బలోపేతం కావడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించింది. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంట్లో భాగంగా బ్యాం కుల ద్వారా తీసుకున్న రుణాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందుతున్నారు. అయితే కొన్నిచోట్ల సభ్యు ల వివరాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని సరి చేసేందుకు ప్రతి మహిళా సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో అవకతవకలకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల్లోని సభ్యుల పొదుపు, రుణాలకు సంబంధించి ఐకేపీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వివరాలను ట్యాబ్లల్లో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాలో స్వయం సహాయక సం ఘాలు 14,873, గ్రామైక్య సంఘాలు 556, సంఘాల్లోని సభ్యులు 1,57,184 మంది ఉన్నారు. సీసీలు ఏపీఎం, డీపీఎంలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. తద్వారా సం ఘాల సభ్యుల వివరాలతో పాటు తీసుకున్న రుణాలు, చెల్లింపులు, పొందుతున్న స్వయం ఉపాధికి సంబంధించిన వివరాలు కూడా ఆన్లైన్లో కనిపిస్తాయి.
ఆన్లైన్లో నమోదు ఎందుకంటే…
స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యంగా సెర్ఫ్( పేదరిక నిర్మూలన సంస్థ) పని చేస్తున్నది. అయితే ఈ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారంటే ఎంతో మంది పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా రాణిస్తున్నారు. ఇలా రూపాయి రూపాయి కూడబెట్టి పొదుపు చేస్తూనే మహిళలు రుణాలు పొందుతున్నారు. తద్వారా వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఇందులో భాగంగా సంఘాల్లో పొదుపు, సభ్యుల హాజరు, అప్పులు, రిజిస్ట్రర్ల నిర్వహణపై ప్రతినెలా సమీక్షించాల్సి ఉంటుంది. స్వశక్తి సంఘాలు, గ్రామైక్య, మండల సమాఖ్య పరిధిలో ప్రతినెలా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. సంఘాల్లోని సొమ్ము దుర్వినియోగం కాకుండా అంతర్గతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహిళలకు సంబంధించిన సంఘం పేరు, బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్, సెల్ నెంబర్ తదితర వివరాలను వారి ఇంటికి వెళ్లి సేకరించి మొబైల్ యాప్ ద్వారా లేదా ట్యాబ్లో అప్లోడ్ చేస్తున్నారు. మహిళ యొక్క ఫొటోను తీసి అప్లోడ్ చేస్తున్నారు. దీంతో అన్ని వివరాలు తెలియడంతో పాటు లోటుపాట్లను కూడా తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మహిళా సంఘంలోని సభ్యురాలి వివరాలు తెలుసుకోవాలంటే సంబంధించిన పుస్తకాలు, బ్యాంకు ఖాతా పుస్తకంలోని పేజీలన్నీ తిరిగేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదు చేస్తే ఒక్క క్లిక్తో అన్ని వివరాలు లభ్యమవుతాయి. అంతే కాకుండా సమాచారం తొందరగా అధికారులు తెలుసుకునే వీలుంటుంది.
పారదర్శకత పెరుగుతుంది
ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్లైన్లో న మోదు చేయ డం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. ఒక్క క్లిక్తో అన్ని వివరాలు లభ్యమవుతాయి. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉన్నా యి. స్వశక్తితో మహిళలు ఎదిగేందుకు ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా తోడ్పడుతున్నది. ఆన్లైన్లో అన్ని వివ రాలు నమోదు చేయడం వల్ల సంఘాలతో పాటు సంఘం సభ్యులకు కూడా పని సులువు అవుతుంది.
-ఉపేందర్రెడ్డి, డీఆర్డీఓ