యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం15వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై సైన్యానికి దిశ దశా నిర్దేశించనున్నట్లు ఆయన వివరించారు.
యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం సాధువెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు తిప్పారపు మహే శ్ ఆధ్వర్యంలో పాల సంఘం చైర్మన్ కామండ్ల సిద్దిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు డొంకెన లింగయ్య, యింజ బక్కయ్య, కాంగ్రెస్ యువజన నాయకులు మిసా హరిబాబు, మ్యాక భాస్కర్, మిసా మల్లేశ్, కృష్ణ, సుంకె అంజయ్య, మ్యాక అజ య్తో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎన్డీసీసీబీ చైర్మన్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అయన మాట్లా డుతూ నాయకత్వం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతోమంది కాం గ్రెస్ నాయకులు తమతో సంప్రదింపులు చేస్తున్నారని, టీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతోనే వివిధ పార్టీల నాయకులు ఆకర్షితులైన పార్టీలోకి చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వాలు చేయని రైతు సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మరో 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్నారు.
పార్టీ ఏర్పాటు నుంచి ఆలేరు నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోటగా నిలుస్తున్నదన్నారు. నియోజకవర్గంలోని 8 మండలా లలో పార్టీ కోసం పాటు పడే నాయకత్వానికి పార్టీ పగ్గాలకు కట్టబెట్టామని అన్నారు. యువతకు సముచ్చిత గౌరవం కల్పించామన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిప ల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాగౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాంటంరాజు, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, ఆవుల మమత, సురేందర్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెంకటయ్య, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముక్యర్ల సతీశ్యాదవ్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, రిజ్వానా, సాదువెల్లి సర్పంచ్ మీస సత్యలక్ష్మి, నాయకులు రాజు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.