నాంపల్లి, జనవరి 21 : ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రేఖ్యాతండా, రాజ్యాతండా, ముష్టిపల్లి, పగిడిపల్లి, బండతిమ్మాపురం, శుంకిశాల, దేవాత్పల్లి, నామనాయక్తండా, పస్నూర్, చల్లవానికుంట, తిర్మలగిరి, మల్లపురాజుపల్లి, తుంగపాడ్, టీపీ గౌరారం గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.2.60 కోట్ల్లు, ఉపాధి హామీ నిధులు రూ.2.10 కోట్లతో సీసీ రోడ్లు, నామనాయక్తండా, చల్లవానికుంట గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు, పస్నూర్ హైస్కూల్లో రూ. 42 లక్షలు, నామనాయక్ తండా పాఠశాలలో రూ.7.90, బీటీ రోడ్డు రూ.1.37కోట్లతో చేపట్ట నున్న పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు జీ. నర్సింహారావు, నాయకులు వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్రావు,శ్రీనివాస్రెడ్డి, ఎం. సుధా కర్రెడ్డి, యాదయ్య,శ్రీశైలంయాదవ్,బి. రాము లు, జగన్మోహన్రెడ్డి, యాదయ్య, గోపాల్రెడ్డి, అబ్బాస్, కే. నర్సింహ,జీ. నారాయణ, రమేశ్, బి. వెంకటేశ్వర్లు, విజయ్, రవినాయక్, నర్సింహ, శంకర్నాయక్, ఆర్. దేవేంద్ర, దేవేందర్, రాజమల్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దేశం చూపు బీఆర్ఎస్ వైపు
తెలంగాణలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశం మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ముష్టిపల్లి, సుంకిశాల, పస్నూర్, తుంగపాడ్, రాజ్యతండా, దేవత్పల్లి, శర్బాపురం, పస్నూర్ గ్రామాల్లో ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించి మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశంలో అమలు కావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు.