నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ బలమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం పీఏపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడారు.
గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు.
కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకంలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని ఆయన సూచించారు. కార్యకర్తల కుటుంబ శ్రేయస్సు కోసం కోట్లాది రూపాయలను వెచ్చించి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు అని ఆయన అన్నారు.
సమావేశంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెలుగురి వల్లపు రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునగాల అంజి రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బన్సీలాల్, అర్వపల్లి నర్సింహ, రేటినేని ముత్యపు రావు, ఎర్ర యాదగిరి, లచ్చి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.