నిడమనూరు, జనవరి 21 : నిరుపేదల కంటి సమస్యలు పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మండలంలోని పార్వతీపురం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని శనివారం ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట పీహెచ్సీ డాక్టర్ మాధవ్కుమార్, సర్పంచ్ వంకా బ్రహ్మన్న, సూపర్వైజర్ కీర్తిబాయి ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
నిరుపేదలకు కంటి చూపును ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపడుతోందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. నందికొండ హిల్కాలనీలోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించారు. డాక్టర్ బిర్లా మాట్లాడుతూ మున్సిపాలిటీలో 142 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 64 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 18 మందికి ఆపరేషన్లు అవసరంమని గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడి పాల్గొన్నారు.
939 మందికి కంటి పరీక్షలు
మండలంలోని కొత్తగూడెం, యాద్గార్పల్లి, వెంకటాద్రిపాలెం, రుద్రారంలో శనివారం కంటి వెలుగులో భాగంగా 939 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 215 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు మండల వైద్యాధికారి షేక్ మొహీద్ తెలిపారు. ఆయా కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట హెచ్సీఓ ప్రభాకర్, ఓంకారమ్మ పాల్గొన్నారు.