మాడ్గులపల్లి, జూలై 04 : నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కరెంట్ షాక్తో మహిళ (55) మృతి చెందింది. గ్రామానికి చెందిన కోలగోట్ల ఆండాలమ్మ, భర్త జానారెడ్డితో కలిసి ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా అనుకోకుండా కరెంట్ షాక్కు గురైంది. వర్షం కారణంగా నేల తడిగా ఉండడంతో షాక్ తీవ్రత ఎక్కువై అక్కడికక్కడే కుప్పకూలింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.