నల్లగొండ : పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లాలోని డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జోగు భాస్కర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. భాస్కర్ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలను పొందారు.
గురువారం డిండిలో భాస్కర్ తండ్రి పర్వతాలుకి పార్టీ సభ్యత్వం ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా మంజూరరై రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాస్కర్ కుటుంబానికి కేసీఆర్ సర్కార్ బాసటగా నిలిచిందన్నారు. ఉద్యమ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించి రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికి అండగా నిలుస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగా రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడులు రాజినేని వెంకటేశ్వర్ రావు, శిరందాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు, స్థానిక సర్పంచ్ మేకల సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.