కోదాడ, జూలై 16 : ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆర్థిక సహకారం అందించి అండగా ఉంటుందని, విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థినులు వర్షిత, ఆసిఫాలను శాలువాతో సన్మానించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారా పేదరికం జయించి సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బానోతు సుశీల బాయి, పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సాదినేని అప్పారావు, మల్లెల పుల్లయ్య, సాతులూరి హనుమంతరావు, వేమూరి విద్యాసాగర్, రావెళ్ల కృష్ణారావు, లైటింగ్ ప్రసాద్, ముత్తవరపు రామారావు, ఉపాధ్యాయులు పుణ్యవతి, మంగమ్మ, స్వరూప, వరలక్ష్మి, శ్రీదేవి, యామిని, నీరజ పాల్గొన్నారు.