నీలగిరి, ఫిబ్రవరి 03 : మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుపడిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ కార్పొరేషన్ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి వేణు ఓటర్లను కోరారు. మంగళవారం 39వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ లో మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి, మామిడి పద్మ, బీఆర్ఎస్ సీనియర్ నేత బక్కా పిచ్చయ్యతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నల్లగొండ పట్టణాన్ని, గాంధీనగర్ణు అన్ని రకాలుగా అబివృద్ధి చేసిన బీఆర్ఎసు గెలిపించాలన్నారు. నల్లగొండ పట్టణాన్ని బీఆర్ఎస్ రూ.1,300 కోట్లతో అభివృద్ధి చేసిందన్నారు. నాడు చేసిన అభివృద్ధి కారణంగా నేడు మున్సిపాలిటీ కాస్త కార్పోరేషన్గా మారిందన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఐదుసార్లు గెలిచి మంత్రిగా రేండేళ్ల నుండి చేసిందేమి లేదన్నారు. గత ఐదు పర్యాయాలుగా గాంధీనగర్లో కాంగ్రెస్కు చోటు లేదన్నారు. కానీ ప్రస్తుతం అధికార కాంగ్రెస్ డబ్బు సంచులతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వస్తుందని దుయ్యబట్టారు. మీలో ఒక్కడిగా ఉంటూ మీముందు ఉంటున్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని వేణు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు విజయలక్ష్మి, జలందర్, వేమన్రావు, సత్యనారాయణ, ప్రసన్న పాల్గొన్నారు.

Gandhinagar : ‘గాంధీనగర్ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తులనే గెలిపించాలి’