తుంగతుర్తి, జూన్ 20 : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
యూరియా పంపిణీలో యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేశ్. తడకమళ్ల రవికుమార్, మల్లేపక రాములు, గడ్డం సోమేశ్, బానోతు పూర్ణ నాయక్, గునిగంటి యాదగిరి, మల్యాల రాములు, సర్పంచ్ మనోజ్, గోపగాని వెంకన్న, కొండగడుపుల వెంకటేష్, నల్లబెల్లి వెంకటేష్, కొండగడుపుల శ్రీకాంత్, తడకమళ్ల మధు, బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.