దేవరకొండ, డిసెంబర్ 11 : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 8, 20 వార్డుల్లో రూ. 90 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, 7వ వార్డులో రూ.3 లక్షలతో డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థ్ధాపన చేశారు. సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్ల నర్సింహ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, వైస్చైర్మన్ రహత్అలీ, కమిషనర్ వెంకటయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, కౌన్సిలర్లు వడ్త్య దేవేందర్నాయక్, నేతాల భాగ్యలక్ష్మి, కొండ్ర మల్లేశ్వరీశ్రీశైలంయాదవ్, నాయకులు శ్రీనునాయక్, సైదులు, బొడ్డుపల్లి కృష్ణ, తౌఫిక్ ఖాద్రి, దీప్లానాయక్, ఇలియాస్ అశోక్, ఏఈ రాజు పాల్గొన్నారు.
మహాలక్ష్మమ్మ ఆలయంలో పూజలు
చందంపేట : మండలంలోని తెల్దేవర్పల్లి గ్రామంలో జరిగిన మహాలక్ష్మమ్మ పండుగలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు హన్మంతు వెంకటేశ్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, లక్ష్మానాయక్, బిక్కునాయక్, మోహన్కృష్ణ, శంకర్నాయక్, రాజు, కృష్ణ, చెన్నానాయక్, లక్ష్మానాయక్, రతన్నాయక్, సుభాశ్నాయక్ పాల్గొన్నారు.