నల్లగొండ రూరల్, డిసెంబర్ 28 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -17 బాలుర జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు కెప్టెన్గా నల్లగొండ పట్టణానికి చెందిన రాచూరి వెంకటసాయి ఎంపికయ్యాడు. కెప్టెన్గా ఎంపికైన వెంకటసాయిని చత్రపతి శివాజీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మపాల గిరిబాబు గురువారం అభినందించి మాట్లాడారు.
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన రాచూరి వెంకటసాయి చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ కరుణాకర్ వద్ద శిక్షణ తీసుకున్నాడని తెలిపారు. ఇటీవల జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యత్తమ ప్రతిభ కనబరిచి ఎస్జీఎఫ్ తెలంగాణ జట్టుకు ఎంపిక కావడంతోపాటు రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడన్నారు. వెంకటసాయి ప్రస్తుతం నల్లగొండ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. కెప్టెన్గా ఎంపికైన వెంకటసాయికి పలువురు క్రీడాకారులు అభినందనలు తెలిపారు.