నల్లగొడ : మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు, విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ మంగళవారం పరిశీలించారు. సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిటింగ్ ఏర్పాట్లు, తరగతి గదిలో వసతులు, పరీక్షల నిర్వహణ , సెల్ఫోన్ల నిషేధం, ప్రశ్నాపత్రాల సీలింగ్ తదితర అంశాలపై చీఫ్ సూపరింటెండెంట్ లకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఇన్విజిలేటర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న శోభారాణిని విధుల నుంచి తొలగించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రెవిన్యూ డివిజనల్ అధికారి రోహిత్ సింగ్, తాసిల్దార్ గణేష్ కూడా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.