ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
సూర్యాపేట టౌన్, జూలై 14 : పోరాడి సాధించిన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆటో యూనియన్ గౌరవాద్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రంలో వాహనాల ఫిట్నెస్ ట్యాక్స్పై లెవీ రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్కేవీ అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సకాలంలో చేయించుకోలేని వాహనదారులకు రోజుకు రూ.50 చొప్పున విధించే అదనపు రుసుమును ప్రభుత్వం రద్దు చేయడంపై వాహనదారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. అన్నిరకాల వాహనాలకు ఇకపై లెవీ విధించవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య కాలానికి ఫిట్నెస్ చేయించుకోని వాహనదారులపై రోజుకు రూ.50 చొప్పున విధించిన ఆలస్య రుసుమును సైతం మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనాత్మకమన్నారు. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయంపై అన్నిచోట్లా వాహనదారులు సంబురాలు జరుపుకొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైదులు, వెంకన్న, అహ్మద్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
దేవరకొండ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
దేవరకొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం దేవరకొండ పట్టణంలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.640 కోట్ల భారం పడినా లారీ యజమానులను గుర్తించి రోజుకు రూ.50 చొప్పున వేసిన ఫైన్ను తొలగించడం హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొండమల్లేపల్లి, పీఏపల్లి, డిండి, చింతపల్లి మండలాల్లోనూ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రావుల చంద్రయ్య, ఎల్లంకి వెంకటయ్య, మహ్మద్ ముషారఫ్, శ్రీశైలం, షబ్బీర్, యూసుఫ్, మల్లయ్య, శివాజీ, యాదయ్య, యాదగిరిగౌడ్, బురాన్, ఎల్లయ్య, రాములు, రాజేశ్ పాల్గొన్నారు.
కోదాడ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
కోదాడ టౌన్ : వాహనాల ఫిట్నెస్పై అపరాధ రుసుం రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోదాడ లారీ అసోసియేషన్ నాయకులు గురువారం అసోసియేషన్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కనగాల నాగేశ్వర్రావు, ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పైడిమర్రి వెంకటనారాయణ, ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావు, సెక్రటరీ తూనం కృష్ణ, మాజీ అధ్యక్షుడు గుండపనేని నాగేశ్వర్రావు, కోశాధికారి నర్సయ్య, నర్సరాజు, రఫీ, గౌస్ పాల్గొన్నారు.
హుజూర్నగర్లో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో..
పట్టణంలో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, నాయకులు జానయ్య, మురళి, కాశయ్య, ప్రశాంత్, నరేశ్, కాశీం, నాగయ్య, అలీబాబా, వెంకటేశ్వర్లు, నరసింహారావు, జాని, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో..
నార్కట్పల్లి : కుమ్మర్ల ఆత్మగౌరవ భవనం కోసం హైదరాబాద్లో మూడెకరాలు, రూ.3 కోట్ల నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం నార్కట్పల్లిలో కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి గురువారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాధారపు భిక్షపతి, నిమ్మనగోటి వెంకన్న, రాధారపు రమేశ్, బండారు భిక్షపతి, వెంకటయ్య, మల్లేశం, వీరస్వామి, రాజు, ఆంజనేయులు, శివశంకర్, సురేందర్, శివ, భిక్షం, నర్మింహ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.