రామగిరి, ఏప్రిల్ 20 : తెలంగాణ కామర్స్ అసోసియేషన్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జూన్ 24న నల్లగొండలోని ఎంజీయూలో నిర్వహించనున్న జాతీయ సెమినార్ పోస్టర్ను శనివారం యూనివర్సిటీలో వీసీ సీహెచ్. గోపాల్రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెమినార్లు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. కామర్స్ హెచ్ఓడీ ఆకుల రవి మాట్లాడుతూ తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్’ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమినార్కు దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి సీనియర్ ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.