భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మంగళవారం వలిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. గోకారం గ్రామంలో రైతు వేదిక, వైకుంఠధామం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతోపాటు జాలుకాల్వ, నెమిలకాల్వ గ్రామాల్లోనూ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అన్నిచోట్లా మరిన్ని పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్నీ తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల తెలిపారు.
వలిగొండ, జూలై 19 : రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని గోకారం, జాలుకాల్వ, నెమిలకాల్వ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 48మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తన సొంత నిధులతో నూతన వధూవరులకు పట్టు వస్ర్తాలు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, సర్పంచులు తుర్కపల్లి మాధవీసురేందర్, మద్దెల సందీప్కుమార్, వంగాల భిక్షపతిగౌడ్, బోళ్ల లలిత, ఎంపీటీసీలు పల్సం రమేశ్, యశోద, భాగ్యమ్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంగాల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కునపురి కవిత, ఎంపీడీఓ గీతారెడ్డి, తాసీల్దార్ శ్యాంసుందర్రెడ్డి, పీఆర్ఏఈ సుగుణాకర్రావు, ముద్దసాని కిరణ్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, ఎమ్మె.లింగస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.