తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ వాహనాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. కోలాటం, బతుకమ్మ ఆడారు. కొన్ని చోట్ల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
అన్ని మున్సిపాలిటీల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు పాల్గొని జాతీయ జెండాలను ఎగురవేశారు. పట్టణాల్లో జరిగిన ప్రగతిని వివరించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్, ఉత్తమ సిబ్బందికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.