రామగిరి, డిసెంబర్ 13 : వర్సిటీ ఐసీటీ అథ్లెటిక్స్లో విజయం సాధించిన విద్యార్థులు త్వరలో జరుగనున్న జాతీయ స్థ్ధాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎంజీయూ ఖ్యాతిని చాటాలని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్రెడ్డి సూచించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఐసీటీ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో పురుషుల ఓవరాల్ చాంపియన్ షిప్గా ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాల భువనగిరి విద్యార్థులు, మహిళా విభాగంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల భువనగిరి విద్యార్థులు నిలిచారు.
వీరికి బహుమతులను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ అల్వాల రవి అభినందించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్.మురళి, డాక్టర్ వై.శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ కళాశాలల పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.