స్వరాష్ట్రంలో మహిళా వికాసానికి పెద్దపీట లభిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. సర్కార్ చేయూతతో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. రాజకీయంగా దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలే సగం స్థానాల్లో పాలకులుగా ఉండడం విశేషం. ఇక ఇదే సమయంలో ఆడశిశువు పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు వివిధ దశల్లో అండగా నిలిచి, ఆత్మైస్థెర్యంతో ముందుకు నడిపించేలా అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ మరో బృహత్తర మహిళా పథకాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రకటిస్తూ అర్హులైన ప్రతి మహిళకు నెలనెలా మూడు వేల రూపాయల జీవన భృతి కల్పించనున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి రాగానే విధివిధానాలను రూపకల్పన చేసి పట్టిష్టవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీపీఎల్ పరిధిలోని లక్షలాది మహిళలకు ప్రయోజనం చేకూరనున్నది. సీఎం కేసీఆర్ ప్రకటనపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ మహిళా పక్షపాతిగా ఉన్నది. మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మరోసారి అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలందరికీ సౌభాగ్యలక్ష్మి పేరుతో నెలకు 3వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని మహిళలంతా నిండు మనస్సుతో స్వాగతిస్తున్నారు. మహిళా సంక్షేమం కోసం ఇంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్న కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని మహిళలంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.
– అమృత, గృహిణి, హాలియా
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఆ కుటుంబం బాగుపడతది. అందరికీ మంచి జరుగతది. ముఖ్యమంత్రి కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సౌభాగ్యలక్ష్మి పథకం మహిళలకు భరోసాగా నిలుస్తుంది. అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.3వేల భృతి ఇవ్వడం గొప్ప పథకం. దీంతో పేద వర్గాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మహిళలకు మేలు జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను మహిళల పేర్ల మీదనే ఇస్తున్నది. తాజాగా మానవీయ కోణంలో ఆలోచించి పేద కుటుంబాల మహిళలకు నెలకు రూ.3వేల చొప్పున జీవన భృతి అందిస్తామని ప్రకటించడం సంతోషకరం. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే మనసున్న గొప్ప లీడర్. గతంలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసిండు. ఇప్పుడు కూడా చెప్పినవన్నీ చేస్తడు. జీవన భృతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. బీఆర్ఎస్కు మహిళలమంతా అండగా ఉంటాం.
– కొడిదల విజయలక్ష్మి, కొండమల్లేపల్లి
అర్హులైన మహిళలకు ప్రతి నెలా మూడు వేల చొప్పున జీవన భృతి అందజేస్తామని, దానికి సౌభాగ్యలక్ష్మి పథకంగా నామకరణం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హ్యాట్రిక్ విజయం సాధిస్తే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తారని సమాచారం. దీని ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 10 లక్షలకు పైగా మహిళలకు ప్రయోజనం కలుగనుంది. దీంతో సుమారు 300 కోట్ల రూపాయలు అర్హులైన మహిళలకు ప్రతి నెలా అందనున్నది.
రాష్ట్రంలోని మహిళలకు ఏ కష్టం రానీయకుండా ఆదుకునేది సీఎం కేసీఆర్ ఒక్కరే. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను అమలు చేయడంతోపాటు ఇప్పుడు పేద మహిళలకు నెలకు రూ.3వేల భృతి ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమానికి ఎంతో చేశాడు. ఇకముందు కూడా చేస్తాడనే నమ్మకం ఉంది. కేసీఆర్ సారు అందించే రూ.3వేల భృతితో మాకు ఎంతో మేలు జరుగుతుంది. మహిళలు ఆత్మగౌరవంగా బతికేందుకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని మహిళల రక్షణకు షీ టీమ్లను ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తున్నారు. తెలంగాణలో మహిళలు ధైర్యంగా ఉన్నారంటే కేసీఆర్ వల్లనే. మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. మహిళలమంతా బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటాం.
– వంటెపాక జానకమ్మ, కుక్కడం, మాడ్గులపల్లి మండలం
సీఎం కేసీఆర్ సారుకు మహిళలంటే ఎంతో గౌరవం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పేర్లతో మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అంతేగాకుండా బతుకమ్మ పండుగలకు చీరెలు, ఒంటరి మహిళలను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఇప్పుడు మహిళలందరికీ ప్రతి నెలా మూడు వేలు ఇవ్వాలని సౌభాగ్యలక్ష్మి పథకాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళలను గుర్తించిండు అనే దానికి ఇంకా ఏం కావాలె. పెద్దన్నలా, మేనమామలా వెన్నంటి ఉంటున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ మహిళలంతా రుణపడి ఉంటారు.
– సింగిరికొండ యామిని, నాగార్జున కాలనీ, నల్లగొండ
సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. తొమ్మిదిన్నరేండ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా వికాసం పట్ల ఆది నుంచీ ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నారు. అందుకే అనేక పథకాలు, కార్యక్రమాలు మహిళల పేర్లపైనే అందిస్తున్నారు. అతివలను అన్ని విధాలుగా ముందుకు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ల ద్వారా జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పంచాయతీల వార్డు సభ్యులు ఇలా అనేక పాలనా పరమైన బాధ్యతల్లో మహిళల పాత్రను క్రియాశీలకం చేసింది. ఇక ఒంటరి మహిళలు, వితంతువులకు, బీడీ కార్మికులకు ప్రత్యేకంగా పింఛన్లు అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తూ వ్యాపారంలో రాణించేలా వెన్ను తట్టుతున్నది. కుటుంబ పోషణలో మహిళల పాత్ర కీలకం కావడంతో వారి పేరిటనే అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నది.
కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి, గృహలక్ష్మి, సఖీ కేంద్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో మహిళా ఆరోగ్యంతోపాటు విసాసం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల చదువుపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ గురుకుల కళాశాలలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి ఆడపిల్లల చదువుకు చేయూతనిస్తున్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక షీ టీమ్లను ఏర్పాటు చేశారు. వేధింపుల నుంచి రక్షణ కోసం సఖీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరెలను ఇస్తూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సమాజంలో సగ భాగమైన మహిళల పాత్ర అత్యంత కీలకమని గుర్తించి మహిళా అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అందుకే మరోసారి అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి మహిళకు నెలకు మూడు వేల రూపాయల జీవన భృతి కల్పించనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇటీవల మ్యానిఫెస్టోలో ప్రకటించిన సన్న బియ్యంతో ఇంటిల్లిపాది మంచి భోజనం చేసే అవకాశం ఏర్పడింది. దీనికితోడు వంటింట్లో గ్యాస్ భారాన్ని దించి మహిళలకు నైతిక ైస్థెర్యం కలిగించేలా రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఆసరా పింఛన్లను రూ.5,016కు పెంచనున్నట్లు వెల్లడించారు. వీటికితోడు సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతి నెలా రూ.3వేల జీవన భృత్తి అందజేస్తామన్నారు. ఇలా మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉన్నది. దీంతో ప్రత్యేకంగా మహిళాలోకం సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నది. జీవితంలోని అన్ని దశల్లోనూ వెన్నంటి ఉంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రజలకు నమ్మకం. ఆయన మాట ఇస్తే తప్పే వ్యక్తి కాదు. పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా సరుకులు కొనాలంటే భారంగా ఉన్నది. పేద మహిళల కష్టాలను అర్థం చేసుకొని సౌభాగ్యలక్ష్మి పథకం ప్రారంభించి రూ.3వేలు ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందంగా ఉంది. గత ఎన్నికల్లో ఇవ్వని ఎన్నో పథకాలను అమలు చేసిండు. దీంతో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడింది. ఒక వర్గం అని కాకుండా ప్రజలందరికీ అమోదయోగ్యమైన పాలన అందించి రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చి రుజువు చేసుకున్నాడు. మూడోసారి కూడా ఆయనే సీఎం కావాలి. అట్లయితేనే పేదలు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతరు. సౌభాగ్యలక్ష్మి పథకం ప్రతి కుటుంబంలో వెలుగు నింపడం ఖాయం.
– నందిపాటి అనసూయమ్మ, కల్లూరు గ్రామం, నేరేడుచర్ల మండలం