నీలగిరి, మార్చి 02 : నల్లగొండలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు శాలిగౌరారం మండలం బండమీదిగూడెం గ్రామానికి చెందిన గైగుల్ల వంశీ (20), ఉట్కూర్ గ్రామానికి చెందిన గుడిసె రవి (20) బైక్పై నల్లగొండకు బయల్దేరారు. చందనపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఎస్పీఆర్ స్కూల్కు చెందిన బస్సు అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుని విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వంశీ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదా బాబు తెలిపారు.