నూతనకల్, డిసెంబర్ 2 : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా వివిధ పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రెడ్డి, దామోదర్రెడ్డి, యుగేంధర్రెడ్డి, ఉప్పుల వెంకన్న, బొడ్డుపల్లి రాములు, నకిరేకంటి అర్జున్, రమేశ్, జాని, రవి, శేఖర్, అశోక్, మురళితో పాటు మరో 30మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పాలన కొనసాగుతూ యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. అందుకే ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, నాయకులు భూరెడ్డి సంజీవరెడ్డి, పన్నాల మల్లారెడ్డి, పగిళ్ల వెంకట్రెడ్డి, నకిరేకంటి వెంకన్న, బద్దం ప్రశాంత్రెడ్డి, మొగుళ్ల వెంకన్న, సైదిరెడ్డి పాల్గొన్నారు.