నల్లగొండ సిటీ, జూన్ 26 : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామాల నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు గతంలో 5వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం పదో తరగతి వరకు ఉచితంగా బస్సు పాస్ అందించనుంది. ప్రభుత్వం ఆదేశించడంతో ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాయితీలు ఇలా..
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా బస్పాస్లు అందజేస్తుండగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు రాయితీ బస్పాస్లను అందిం చనుంది. ప్రైవేటు పాఠశాలల్లో 12 ఏళ్లలోపు బాలురు 18 ఏళ్ల లోపు పదో తరగతి వరకు బాలికలు ఉచిత పాసులు పొందాలన్నా ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీకి కొత్త మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ ఆర్టీసీ నల్లగొండ పేరిట డీడీలను తీసి సమీపంలోని డిపోల్లో అందజేయాలి. 200 మంది లోపు విద్యార్థులున్నా ప్రైవేట్ పాఠశాలలు రూ.700, 500 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు రూ.1000 ,500 మంది పైన విద్యార్థులున్నా పాఠశాలలు అడ్మిస్ట్రేటివ్ చార్జీలు (ఫ్రెష్) కింద రూ.2 వేలు చెల్లించాల్సి ఉటుంది. డిగ్రీ, పీజీ కళాశాలల యజమాన్యాలు రూ.6 వేలు( కొత్తవి) రెన్యువల్ కోసం రూ.5 వేలు చెల్లించాలి. జూనియర్ డిప్లొమా ఒకేషనల్ యజమాన్యాలు ఆడ్మిస్ట్రేటివ్ చార్జీల కింద రూ.5 వేలు రెన్యువల్ కోసం రూ.4 వేలు చెల్లించాలి.
ఇంటి నుంచి పాస్ పొందే అవకాశం
గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పల్లె వెలుగు బస్సుల్లో 12 యేండ్ల లోపు బాలురుకు 20 కి.మీ దూరం వరకు పాఠశాలలకు వెళ్లడానికి రోజు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే 18 ఏండ్ల బాలికలకు పదో తరగతి వరకు బాలికల కోసం ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఆర్టీసీ పాస్ కోసం ఇంట్లో నుంచి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పైసా ఖర్చు లేకుండా వెబ్సైట్లో అడిగిన వివరాలను పొందు పరిచి ఫొటో అప్ లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు .www.online.tsrtcpass.in అనే వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. రిజిస్ట్రర్ అయితే నమోదు సంఖ్య వస్తుంది. దాన్ని పాస్ కౌంటర్లోని సిబ్బందికి అందజేస్తే బస్పాస్ వస్తుంది. తప్పని సరిగా ఆయా విద్యాసంస్థలు అంగీకరిస్తేనే పాస్ జారీ అవుతుంది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ.50 చెల్లిస్తే బస్పాస్ అందిస్తారు.
35 కిలో మీటర్ల లోపు రాయితీ పాస్లు..
స్టూడెంట్ బస్పాస్ రాయితీ కూడిన విద్యార్థులు చార్జీలు కేటాయించారు. ప్రైవేట్ పాఠశాలల్లో 12 ఏండ్ల పైబడిన బాలురు కళాశాల విద్యార్థులు ఆర్టీసీ రాయితీ పాస్లు పొందవచ్చు. 35 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉన్న బస్పాస్లకు కిలోమీటర్ చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. గుర్తింపు కార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది.
ప్రైవేట్ విద్యాసంస్థలు డీడీలు చెల్లించాలి
విద్యార్థులకు ఉచిత పాస్లే కాకుండా రూట్ పాస్లు కూడా జారీ చేస్తారు. బస్పాస్లు పొందడానికి ప్రైవేటు విద్యాసంస్థలు అడ్మినిస్ట్రేటివ్ రుసుం చెల్లించాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సంస్థలను బట్టి వార్షిక రుసుం నిర్దేశించారు. రుసుం చెల్లించి అనుమతి పొందిన విద్యా సంస్థలకే ఆర్టీసీ ఆన్లైన్లో చోటు ఉంటుంది. దీని ఆధారంగా విద్యార్థులకు రాయితీ బస్పాస్ల జారీ కొనసాగుతుంది. 3 నుంచి 6 నెలలు ఇలా కాలపరిమితితో కూడిన బస్పాస్లను కిలో మీటర్ను బట్టి రాయితీతో పొందవచ్చు.
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ప్రయాణ సౌకర్యం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీ పేరిట డీడీలను చెల్లించాలి. విద్యార్థులకు బస్పాస్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. బస్టాండ్లో బస్పాస్ల కౌంటర్ను ఏర్పాటు చేశాం. విద్యార్థులకు పాస్ల సమస్యలు ఉంటే అక్కడ సంప్రదించాలి.
-శివశంకర్, డీవీఎం