CJP counter | నీట్ పేపర్ లీకేజీపై(NEET) దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేపర్ లీకేజీ బాధ్యులపై ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని గురువారం ఉదయం ప్రధాని మోదీ ఎక్స్(PM Mod Tweet) వేదికగా తెలిపారు. అయితే ప్రధాని మోదీ ట్వీట్పై లోకసభ విపక్ష నేత, సీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల జీవితాలను దెబ్బ తీసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్పై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.
విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేరానికి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు సీజేపీ కూడా మోదీ ప్రకటనపై దీటుగా స్పందించింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతక బాధ్యత వహిస్తూ రాజీనామ చేయాలన్నారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.