రామగిరి, ఏప్రిల్ 20 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్రెడ్డి గురువారం సంయుక్త ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ చదివే విద్యార్థులూ దరఖాస్తుకు అర్హులని తెలిపారు.