మిర్యాలగూడ రూరల్, మే 11 : మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు బుధవారం అన్నారం వెళ్లి తండ్రి శ్రీనివాస్రెడ్డిని పరామర్శించారు.
మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సంప్రదింపులు జరుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పార్థీవ దేహాన్ని తెప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ధానావత్ చిట్టిబాబూనాయక్, దామరచర్ల మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కుందూరు వీరకోటిరెడ్డి, సర్పంచ్ అంబటి వీరారెడ్డి, సైదిరెడ్డి, వెంకట్రెడ్డి, శంకర్నాయక్ ఉన్నారు.