కక్షలు, హత్యా రాజకీయాలతో రగిలిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా మార్చి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం నూతనకల్ మండలం చిల్పకుంట్లలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు గోదావరి జలాలు తీసుకొచ్చి రెండు పంటలకు నీరు అందిస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు.
నూతనకల్, మే 10 : తుంగతుర్తి నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాల నుంచి అభివృద్ధి దిశగా పయనింపజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో రాజకీయ అలజడి తప్ప అభివృద్ధి జాడలు కనిపించలేదని విమర్శించారు.
ఉద్యమ నాయకుడిగా నాడు కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలు తీసుకువచ్చి రెండు పంటలకు నీరందిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారన్నారు. అంబేద్కర్ కలలు గన్న పాలనను సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాప్, ఎంపీపీ భూరెడ్డి కళావతి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచ్ కొంపెల్లి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిక్కి బుచ్చయ్యగౌడ్, నాయకులు పులుసు లింగమల్లయ్య, బత్తుల విద్యాసాగర్, విజయ్కుమార్, చూడి లింగారెడ్డి, బాణాల సత్యనారాయణరెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.