నల్లగొండ, ఫిబ్రవరి 16 : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ ఓపీఎస్ను అమలు చేయాలని, ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని టీఎన్జీఓస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదురుగా శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎన్జీఓస్ అధ్యక్షుడు నాగిళ్ల మురళి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, అన్ని కార్యాలయాల్లో కేడర్ స్ట్రెంత్ను పెంచి డీఏలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి జె.శేఖర్ రెడ్డి, నాన్ గెజిటెడ్ సహకార శాఖ అధ్యక్షుడు వంగూరి విజయ్ కృష్ణ, చేపూరి నరసింహ చారి, ఆకునూరి లక్ష్మయ్య, పాల్వాయి గామయ్య, పి.వెంకట్ రెడ్డి, మధుసూదనా చారి, కత్తుల మనోజ్ ప్రదీప్, వి. భాసర్, కె.దశరథ, డీఐ రాజు, డి. యాదయ్య పాల్గొన్నారు.