తిరుమలగిరి (సాగర్), డిసెంబర్ 5 : గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెంపకందారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గొర్రెలు, మేకల జాతి జన్యు అభివృద్ధి పథకానికి ఎంపికైన లబ్ధిదారులు నిబంధనలు పాటించాలని కోరారు.
జీవాలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, జడ్పీటీసీ సూర్య భాష్యానాయక్, వైస్ ఎంపీపీ ఎడవెల్లి దిలీప్రెడ్డి, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి యాదగిరి, మండల పశువైద్యాధికారి అజ్మీరా కేశవ్, సర్పంచులు బి.కైక బిచ్యా, స్వామినాయక్, జ్యోతీరామకృష్ణనాయక్, స్థానిక ఎంపీటీసీ రాకేశ్, మాజీ ఎంపీపీ అల్లి పెద్దిరాజుయాదవ్, ఉపసర్పంచ్ కిశోర్, బీవీ.రమణరాజు, వపీఏసీఎస్ డైరెక్టర్ దేశ్య పాల్గొన్నారు.