చండూరు : డబుల్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తరలిస్తున్న క్రమంలో టిప్పర్ విద్యుత్ తీగలు తగిలి పూర్తిగా దగ్ధమైంది.వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో బంగారుగడ్డ నుండి నాంపల్లి వరకు రెండు వరుసల డబుల్ రోడ్డుకు నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఈ రోడ్డుకు సోమవారం టిప్పర్తో మట్టి పోస్తూ చదును చేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక టిప్పర్ మట్టిలోడుతో వచ్చి అన్లోడ్ చేస్తుండగా పైన ఉన్న 33కెవి కరెంటు మెయిన్ లైన్ను డ్రైవర్ చూసుకోకపోవడంతో టిప్పర్ బాడీ, ట్రక్కుకు విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగి టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో క్లీనర్ అప్రమత్తమై కిందకు దూకగా, టిప్పర్ డ్రైవర్ కరెంటు షాకు గురయ్యారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గుర్తించి వెంటనే హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.