ఇన్నాళ్లూ పాఠశాలల్లో అంతర్గత పరీక్షలకు పరిమితమైన విద్యార్థులు ఎల్లుండి తొలిసారి బోర్డు ఎగ్జామ్ రాయబోతున్నారు. కొద్దిరోజుల నుంచి రేయింబవళ్లు అందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత తరుణంలో పిల్లలకు కావాల్సింది ఒత్తిడికి లోనవకుండా సరైన ప్రణాళిక. కాసింత ధైర్యం, ఒకింత మద్దతు.
కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లుగా పదో తరగతి వార్షిక పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈ ఏడాది కరోనా కొత్త కేసులు లేకపోవడంతో విద్యార్థుల చదువు సాఫీగా సాగింది. ఈ నెల 23 నుంచి జరిగే పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల ఓపెన్ నుంచి పరీక్ష ముగిసిన తర్వాత సీల్ చేసే వరకు పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 240 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 42,003 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎండాకాలం నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటిని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. కొవిడ్ నిబంధనలు కూడా అమలు చేయనున్నారు. పరీక్షలపై సందేహాలు, ఫిర్యాదులకు డీఈఓ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు.
ఎస్ఎస్సీ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 42,003మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా 240 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వైద్య సిబ్బందిని నియమించారు. కొవిడ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు పరీక్షలపై సందేహాలు, ఫిర్యాదులకు డీఈఓ కార్యాలయంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. మే 23 నుంచి జూన్ 1వరకు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:45వరకు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులు హాల్టికెట్స్ను www.bse.telangana.gov.inలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
– రామగిరి, మే 20
కలెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలమేరకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చ ఏశాం. ముఖ్యంగా వేసవి దృష్టిలో ఉంచుకుని తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలతోపాటు వైద్య సిబ్బంది(ఎఎన్ఎం) కూడా అందుబాటులో ఉంటారు. పరీక్ష సమయం కంటే గంట ముందుగానే విద్యార్థులు చేరుకోవాలి. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేలా ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతోపాటు ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ గదితోపాటు రెండు సీసీ కెమెరాలు బిగించారు. ప్రశ్న ప్రతాల బండిల్స్ ఓపెన్ చేయడం, ముగిసిన తర్వాత సీల్చేసే సన్నివేశాలు రికార్డు కానున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేయగా, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. పరీక్ష ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు రికార్డు అయిన సీపీ పుటేజీని సీల్డ్ కవర్లో భద్రపర్చి డీఈఓలకు అప్పగించనున్నారు.
పరీక్షల నిర్వహణలో మాస్ కాపీంగ్కు తావులేకుండా చూచిరాత నిరోధక చట్టం -1997ను పకడ్బందీగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. టెన్త్ పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడినా, ప్రోత్సహించినా వారిని దోషులుగా గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బంది అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని వ్యవహరించాలి. లేకపోతే చట్టప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పరీక్షల సిబ్బంది విధిగా గుర్తింపు కార్డు(ఐడీ) ధరించాలి.సెల్ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకు రావద్దు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు పాఠశాల విద్యాశాఖ సూచనలను పాటించాలి. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద డీఈఓ, ఎంఈఓతోపాటు సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్స్ ప్లెక్సీపై ముద్రించి అందుబాటులో ఉంచాలి.
మార్గదర్శకాలివే..నేరేడుచర్ల, మే 20 :పదో తరగతి పరీక్షలకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ నెల 23 నుంచి జరుగనున్న పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 240 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 42,003 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సూర్యాపేట జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల్లో 12,612 మంది, నల్లగొండ జిల్లాలో 107 పరీక్ష కేంద్రాల్లో 19,915 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల్లో 9,476 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. గతంలో 11 పేపర్లు ఉండగా ప్రస్తుతం 6 పేపర్లకు కుదించారు. పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లకు, డీఓలకు, ఇన్విజిలేటర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా కారణంగా సిలబస్ సకాలంలో పూర్తి కాకపోవడంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ 30 శాతం సిలబస్ తొలగించడంతో పాటు 11 పేపర్లను 6 పేపర్లకు కుదించింది. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు వారితో పాటు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఏకాగ్రత, ప్రణాళికా బద్ధంగా చదివితే విజయం తప్పక వరిస్తుందని వారు పేర్కొంటున్నారు.
పరీక్షకు రెండు గంటల ముందు చదువడం ఆపేయాలి. కొత్త పుస్తకాలు, కొత్త సబ్జెక్టులు చదువకూడదు. నూనె వస్తువులు, కారంతో ఉన్న మసాలా ఆహారాన్ని తీసుకోకూడదు. పరీక్షకు వెళ్లే సమయంలో మితంగా తినాలి. తినకుండా పరీక్షకు వెళితే మెదడుకు గ్లూకోజ్ అందక సమాధానాలు గుర్తుకురావు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా కచ్చితంగా రాయగలననే ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి.
పిల్లల ఎదుట తల్లిదండ్రులు గొడవపడకూడదు. పరీక్షల సమయంలో ఇంటిల్లిపాది టీవీ చూడటం, సెల్ఫోన్లలో మాట్లాడటం, కూర్చుని బాతాఖానీ చేయడం మానేయాలి. నిరంతరం చదువాలంటూ పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. ఎలా చదివితే బాగుంటుందో వారికి అర్థమయ్యేలా వివరించాలి.
పరీక్షలు దగ్గర ఉన్నాయని ఎక్కువ గంటలు చదువుతూ ఆహారం, నిద్ర మరిచిపోతుంటారు. దీనివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చదువుకున్నదంతా పరీక్షల సమయంలో గుర్తుకురాదు. గంటలో 15 నిమిషాలు మెదడుకు విశ్రాంతినివ్వాలి. ఎక్కువ గంటలు చదువడం కాదు. ఎంత గుర్తుంచుకున్నామనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి.
పరీక్షల సమయంలో పాఠ్యాంశాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. లేకపోతే పరీక్షలు దగ్గర పడే కొద్దీ ఏది చదువాలో అర్థం కాక ఒత్తిడికి లోనవుతుంటారు. తరగతి గదిలో ఉపాధ్యాయలు చెప్పిన పాఠాలను ఏరోజుకారోజు మననం చేసుకోవడం వల్ల పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు డీఈఓ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా హెల్ప్డెస్క్లు(కంట్రోల్ రూమ్స్) ఏర్పాటు చేశారు.
నల్లగొండ
9121212513,7989536915
సూర్యాపేట
8247809660
యాదాద్రి
08685-293422