నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా రైతుబంధు సంబురాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు, రైతుబంధు సమితి సభ్యులు వివిధ రూపాల్లో తమ అభిమానం చాటుతున్నారు. దేవరకొండలో ఘనంగా రైతుబంధు వేడుక నిర్వహించారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అందమైన ముగ్గులతో అలంకరించి సీఎం కేసీఆర్, రైతుబంధు జై అంటూ రాసారు. దేశంలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదని, సీఎం కేసీఆర్కే ఈ ఘనత దక్కుతుందని ఎమ్మెల్సీ గుత్తా తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.