నల్లగొండ : కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో పల్లెలన్నీ సుభిక్షంగా విరాజిల్లుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నార్కట్ పల్లి మండలంలోని జువ్విగూడెం, నక్కలపల్లి గ్రామాల పరిధిలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి సుమారు రూ.2 కోట్ల పైచిలుకు పనులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేశారు.
మొదట జువ్విగూడెం గ్రామ పరిధిలో షాపల్లి PWD రోడ్ నుంచి గడ్డమీదిబావి వయా వెంకటేశ్వర్లబాయి వరకు కోటి 20 లక్షలతో చేపట్టనున్న బి.టి. రోడ్డు పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం నక్కలపల్లి గ్రామ పరిధిలోని సబ్బిడిగుడెం, పెద్దబావిగూడెం, గద్దగూటిబావి, నక్కలపల్లిలో రూ.82.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీపీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూత తెలంగాణను దేశంలోనే ముందంజలో నిలిపారన్నారు. పల్లెప్రగతి వంటి పథకాలతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.