నల్లగొండ : తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని చీమలగడ్డ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
చీమలగడ్డకు చెందిన కొండ చిన్నరాములు (55) గీత కార్మికుడు. రోజువారీగా కల్లు గీసేందుకు సాయంత్రం తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.