నల్లగొండ రూరల్, జనవరి 10: ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని ఎల్ఐసీ బ్రాంచ్- 1 ఆఫీస్ వద్ద క్లాస్ వన్ ఆఫీసర్స్ బుధవారం గంట సేపు సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎల్ఐసీ ఉద్యోగులకు 2022 ఆగస్టు ఒకటో తేదీ నుంచి నుంచి వేతన ఒప్పందం బకాయి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు.
ప్రతి ఏడాది రిటైర్మెంట్లు పెరుగుతున్నప్పటికీ కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్లాస్ వన్ ఆఫీసర్స్, డెవలప్ మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు గురుమూర్తి, నవీన్ దాసు, కృష్ణయ్య, వెంకట్, రెడ్డి పాల్గొన్నారు.