మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలైంది. చండూరు రెవెన్యూ
డివిజన్గా ఏర్పాటు కానున్నది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం ప్రభుత్వం
బుధవారం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. చండూరు, మునుగోడు, గట్టుప్పల, మర్రిగూడ, నాంపల్లి మండలాలతో రెవెన్యూ డివిజన్ కానుండగా మరో వారం పది రోజుల్లో చండూరులో ఆర్డీఓ కార్యాలయం అందుబాటులోకి రానున్నది. మంత్రి జగదీశ్రెడ్డితో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు.
ఇక నార్కట్పల్లి మండలంలోని అమ్మనబోలును మండలంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. శాలిగౌరారం మండలంలోని ఉప్పలంచ, రామాంజపురం, రామన్నపేట మండలంలోని కుంకుడుపాముల, బి.తుర్కపల్లి, సూరారంతోపాటు అమ్మనబోలును కలిపి మండలంగా చేయనుండగా 15 రోజులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నది. మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఏండ్ల కల నెరవేరనున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి కృతజ్ఞతలు తెలిపారు.
చండూరు, సెప్టెంబర్ 28: చండూర్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటైంది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం బుధవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో ఆర్డీఓ కార్యాలయం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు మండలాలు, ఆర్డీఓ కార్యాలయాలను గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పరిపాలన ప్రజలకు చేరువైంది.
అందరూ భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో గతేడాది గట్టుప్పల ప్రజల చిరకాల కోరిక అయిన గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు చండూరు కేంద్రంగా మునుగోడు, గట్టుప్ప, మర్రిగూడ, నాంపల్లి మండలాలను కలుపుతూ ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రకటిస్తూ సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ 20న ముగియడంతో తుది నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది.
గతంలో మర్రిగూడ, నాంపల్లి మండలాలు దేవరకొండ ఆర్డీఓ పరిధిలో ఉండడంతో అక్కడి నుంచి దస్తావేజులు తెప్పించుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరో వారం పది రోజుల్లో చండూరులో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కానుంది. దాంతో ఆర్డీఓను నియమించనుంది.
సిద్ధమవుతున్న భవనం
చండూరు పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కోసం సిద్ధం చేస్తున్న స్త్రీ శక్తి భవన్ పునరుద్ధరణ పనులు పూర్తి కావచ్చాయి. భవన నిరుపయోగం ఉండడంతో పూర్తిస్థాయిలో వినియోగానికి తీసుకొచ్చేందుకు రూ.10 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి త్వరగా వచ్చిన అందుబాటులోకి ఇచ్చేటందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వారం రోజుల్లో భవనం నిర్మాణం పూర్తిగా అందుబాటులోకి రానుంది.
చండూరు పట్టణంలో ఏర్పాటు చేయనున్న తుది నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి జగదీశ్రెడ్డి రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నందుకు చా లా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.