నల్లగొండ : ప్రతి పల్లెలో గులాబీ జెండా పండుగను ఉత్సవంలా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ రాష్ర్టాన్ని సాధించిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణను అన్ని రంగాలను అగ్రగామిగా నిలుపుతున్న పార్టీకి 21 ఏండ్లు నిండాయని ఆయన తెలిపారు. రేపు పార్టీ 21 వ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులు అందరూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల స్థాయి నాయకులు, పట్టణాలలో పట్టణ అధ్యక్షులు, అన్ని వార్డులలో వార్డ్ మెంబెర్స్ , గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు జెండా ఎగురవేయాలి అని ఆయన సూచించారు. ప్రతి పల్లెలో గులాబీ జెండాలు రెపరెపలాడాలన్నారు.
హెచ్ఐసీసీలో ప్రతినిధుల సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ మండలాల, పట్టణాల అధ్యక్షులు హాజరుకావాలని కోరారు. సమావేశంలో గాఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుబే ఉజ్జిని విద్య సాగర్ రావు, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమావత్ కొండల్ నాయక్, మహిళా అధ్యక్షురాలు పున్రెడ్డి సుమతి రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదిరాల కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.