యాదాద్రి: లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. ఆలయం లో తెల్లవారు జాము నాలుగు గంటల నుంచే ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరా ధనలు ప్రారంభించారు. హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. హోమం జరిపా రు. ప్రతీ రోజు నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతును జరిపారు. కల్యాణ మూర్తుల ను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు నిర్వహించారు. ఉద యం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు.
మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కొండ కింద పాత గోశాల వద్ద గల వ్రత మండపం లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతాలచరించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.