యాదాద్రి, నవంబర్ 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధిసేవ, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో సాగింది. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శన నారసింహ హవనం జరిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది.
ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు ధపాలుగా సువర్ణపుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 18వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.22,90,043 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,84,800
వీఐపీ దర్శనాలు 60,000
బ్రేక్ దర్శనాలు 97,200
వేద ఆశీర్వచనం 15,600
సుప్రభాతం 1,400
ప్రచార శాఖ 57,600
వ్రత పూజలు 1,48,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 53,000
ప్రసాద విక్రయం 11,22,850
వాహనపూజలు 10,100
శాశ్వత పూజలు 37,500
అన్నదాన విరాళం 25,989
సువర్ణ పుష్పార్చన 93,864
యాదరుషి నిలయం 48,440
పాతగుట్ట నుంచి 26,200
కొండపైకి వాహన ప్రవేశం 3,00,000
శివాలయం 5,400