హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సురక్షితమైన డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించడం, సైబర్ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే 722 సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లక్షకు పైగా ప్రజలకు చేరువైనట్టు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.