నల్లగొండ : గణేష్ నిమజ్జన శోభాయాత్రను హనుమాన్ నగర్లోని 1వ నెంబర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజులు చేసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకకు భారీగా భక్తులు హాజరయ్యారు. కాగా, గణేషుడి లడ్డును ఇంజినీర్ బొడ్డుపల్లి సతీష్ రూ.6లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నాడు. సతీష్కు లడ్డూ ప్రసాదాన్ని మంత్రి అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాధ్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.