హాలియా, ఫిబ్రవరి 18 : సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శనివారం అనుముల మండలం పేరూరు గ్రామంలో శిథిలావస్థకు చేరిన చెన్నకేశవ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి వారు భూమిపూజ నిర్వహించారు. వెయ్యి సంవత్సరాల నాటి చెన్నకేశవ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు పూనుకోవడం గొప్ప విషయమన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్, జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ సుమతీ పురుషోత్తం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, ఎడమకాల్వ మాజీ వైస్చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రావుల చినభిక్షం యాదవ్, ఎంపీటీసీ రావుల రాంబాబు, తిరుమలగిరి (సాగర్) వైస్ ఎంపీపీ దీలిప్రెడ్డి, వెనిగండ్ల పీఏసీఎస్ అధ్యక్షుడు కేవీ రామారావు, బీఆర్ఎస్ అనుముల, తిరుమలగిరి (సాగర్) మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, ఆలయ చైర్మన్ ఆర్. రామలింగయ్య, నిర్మాణ కమిటీ చైర్మన్, సీఐ అర్కపల్లి ఆంజనేయులు, సర్పంచ్ సుధారాణీనాగరాజు పాల్గొన్నారు.