నల్లగొండ రూరల్, అక్టోబర్ 15 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్లో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్ అన్నారు. బుధవారం బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించిన బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ లకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ జనాభా 56 శాతం ఉంటే కేవలం 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా కూడా కొంత మంది ఓర్వలేక పోతున్నట్లు తెలిపారు. తామేమైనా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు అడుగుతున్నామా అని ప్రశ్నించారు. కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లకు కూడా ఓర్వకుండా కోర్ట్ లలో కేసులు వేసి నోటీకాడి ముద్దను లాగివేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే తామేమైనా అడ్డుపడ్డమా అని అడిగారు. జీఓ నంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తమ రిజర్వేషన్ల జోలికి ఎవ్వరు రావొద్దని, 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ లో అందరూ పాల్గొనాలన్నారు. బంద్లో విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆర్టీసీ, సకల జనులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తండు సైదులు గౌడ్, వైదుల సత్యనారాయణ, పందుల సైదులు గౌడ్, భోనగిరి దేవేందర్, కట్టెకొల్లు దిపేందర్, ఎంఆర్పీఎస్ బకరం శ్రీనివాస్, దేవయ్య, కర్నాటి యాదగిరి, చీర పంకజ్ యాదవ్, పాల్వాయి రవి, కట్టెల శివ, కొంపల్లి రామన్న గౌడ్, చెనగోని నరేష్, వంశీ, నాగరాజు పాల్గొన్నారు.