హాలియా : పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన తలపెట్టిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంటిగ్రేటెడ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్, మినీ స్టేడియం, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై అజమాయిషీ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర జాబితాతో పాటు ఉమ్మడి జాబితాలోని పలు అంశాలపై శాసనం చేసే అధికారాన్ని రాష్ట్రాలు కట్టబెట్టే విధంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను వక్రీకరించి మాట్లాడడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దళితులు వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం 100116 ఇస్తుందన్నారు.