నకిరేకల్, మార్చి 15 : నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మితమవుతున్న 100 పడకల ఆస్పత్రికి గాంధీ హాస్పిటల్గా నామకరణం చేస్తామని, హాస్పిటల్ ముందు భాగంలో అద్భుతమైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కీర్తిని పెంచుతామని ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంఘ భవనంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వీరేశాన్ని సన్మానించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో నకిరేకల్ సెంటర్లో అన్నదానం చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, మండల, పట్టణాధ్యక్షులు బ్రహ్మదేవర రామ్మోహన్, వీర్లపాటి నర్సింహారావు, యువజన విభాగం అధ్యక్షులు బెల్దె శ్రీను, మహిళా విభాగం అధ్యక్షురాలు సోమ కృష్ణవేణి, జిల్లా నాయకులు సోమ యాదగిరి, నాయకులు బ్రహ్మదేవర రమేశ్, రఘునాథ్ పాల్గొన్నారు.