నార్కట్పల్లి, జనవరి 5 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి కపిల్ పటేల్కు వివరించారు. రూరల్ డెవల్మెంట్పై ఢిల్లీలోని బీఆర్.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో గురువారం నిర్వహించిన నేషనల్ వర్క్షాప్లో తెలంగాణ ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి ప్రణాళికలు తయారు చేసి కేంద్ర మంత్రికి అందించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మేలు ఎలా జరుగనున్నాయో రూపొందించిన ప్రణాళిక తెలిపారు. అదేవిధంగా కల్లాల నిర్మాణం, రైతు వేదికలు, పలు అభివృద్ధి పనుల తీరు, పథకాల అమలు సమావేశంలో స్పష్టంగా వివరించారు.