కొండమల్లేపల్లి, డిసెంబర్ 22 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం మనఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గన్యనాయక్తండాలో రూ.20 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇప్పటికే పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు నిర్మించిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, అబ్బనబోయిన శ్రీనివాస్యాదవ్, సర్పంచ్ రాములు, రమావత్ లాలూనాయక్, రమావత్ శ్రీను, రావుల వెంకటయ్య, రమావత్ తులసీరాం, భీమ్సింగ్, బొడ్డుపల్లి కృష్ణ, భద్రునాయక్, ముడావత్ పాండు, పరిపూర్ణాచారి, వెంకటేశ్, వీరస్వామి, బాల్రాజ్రెడ్డి పాల్గొన్నారు.
గీతకు నివాళి
పాత కొండమల్లేపల్లికి చెందిన నల్లగాసు గీత అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆమె ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
దేవరకొండ : పట్టణంలోని 11వ వార్డులో రూ.3లక్షల చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శంకుస్థ్ధాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో అన్ని వసతులు కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, కమిషనర్ వెంకటయ్య, వేముల రాజు, తౌఫిక్ఖాద్రీ, జయప్రకాశ్, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
సైన్స్ఫెయిర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే
దేవరకొండ : పట్టణంలోని బచ్పన్ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ఫెయిర్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందరంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు సైన్స్ఫెయిర్ దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, సైదులు, పాఠశాల హెచ్హెం జంగయ్య, ఇల్లెందు శ్రవణ్కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.